తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఏకంగా తహశీల్దాదార్ కార్యాలంయలోనే వీఆర్ఏను చంపేశారు. కన్నెపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో ఈ దారుణం జరిగింది. కొత్తపల్లి వీఆర్‌ఏగా దుర్గంబాబు అనే వ్యక్తి పని చేస్తున్నారు. ఆయన్ను గుర్తు తెలియని దుండగులు తహశీల్దార్‌ ఆఫీసులోనే చంపేశారు.

రక్తపు మడుగులో ఉన్న దుర్గంబాబును స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.  పోలీసులు వచ్చి శవాన్ని పరిశీలించి.. విచారణ ప్రారంభించారు. భూవివాదాలు ఏమైనా ఈ హత్యకు దారి తీశాయా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. వీఆర్‌ఏలు గ్రామాల్లో కీలకమైన విధుల్లో ఉంటారు. గ్రామాల్లోని రెవెన్యూ వ్యవహారాలను వీఆర్ఏకు, తహశీల్దార్‌కు అందిస్తుంటారు. ఇలాంటి కీలకమైన విధుల్లో ఉన్నందున.. ఏదైనా భూ వ్యవహారమో.. ఇసుక మాఫియా వ్యవహారమో హత్యకు దారి తీసి ఉండొచ్చని భావిస్తున్నారు. గ్రామస్తులు మాత్రం దుర్గంబాబు వివాదాల జోలికి పోడని చెబుతున్నారు. అసలు విషయం విచారణలో తేలాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: