కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎట్టకేలకు ఈడీ ముందు హాజరుకాబోతున్నారు. ఈనెల 21న ఈడి విచారణకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరుకానున్నారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో విచారణకు హాజరుకావాలని సోనియా గాంధీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి
సోనియా గాంధీ గత నెలలోనే ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ.. కరోనా కారణంగా సోనియా గాంధీ విచారణకు వెళ్లలేదు.

దీంతో  సోనియాగాంధీకి తాజాగా ఈడీ సమన్లు జారీ చేసింది. దీంతో విచారణకు వెళ్లాలని సోనియా గాంధీ నిర్ణయించుకున్నారు. గత నెలలో సోనియా గాంధీ తనయుడు రాహుల్‌ గాంధీని ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీని ఈడీ ఐదు రోజుల పాటు విచారించింది. మొత్తం 55 గంటల పాటు రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించింది. ఇక ఇప్పుడు సోనియా గాంధీ  వంతు వచ్చింది. సోనియా గాంధీ  విచారణ ఎన్నిరోజులు సాగుతుందో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: