వైవీ సుబ్బారెడ్డి.. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కు స్వయానా బాబాయి. వైఎస్‌ జగన్ తండ్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డికి వైవీ సుబ్బారెడ్డి తోడల్లుడు. అందుకే వైఎస్‌ కుటుంబానికి ఆయన ఆత్మీయుడు. అయితే.. గతంలో సీబీఐ జగన్‌ అక్రమాస్తులపై అనేక కేసులు పెట్టింది. వాటిలో విచారణ ఇంకా కొనసాగుతోంది. తాజాగా జగన్ అక్రమాస్తుల కేసులో వైవీ సుబ్బారెడ్డి క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.


ఇందూ హౌజింగ్ బోర్డు ఛార్జ్‌షీట్‌లో తన పేరు కొట్టివేయాలని కోరిన వైవీ సుబ్బారెడ్డి హైకోర్టుకు విన్నవించుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తోడల్లుడైనందుకే తప్పుడు కేసు పెట్టారన్న వైవీ సుబ్బారెడ్డి వాదిస్తున్నారు. అయితే.. వైవీ సుబ్బారెడ్డిపై కేసు కొట్టివేయవద్దని తెలంగాణ హైకోర్టును  సీబీఐ కోరింది. వైవీ సుబ్బారెడ్డి లక్షలు పెట్టుబడి పెట్టి కోట్లు పొందారని వాదిస్తోంది. వైవీ సుబ్బారెడ్డి వేసిన క్వాష్ పిటిషన్‌పై వాదనలు పూర్తి చేసిన హైకోర్టు  తీర్పు రిజర్వ్ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: