రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ శ్రీ లక్ష్మీ భర్త సివిల్ ఇంజనీర్ అయిన నవరాజును ఈనెల 8వ తేదీన కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో స్థానికులు రావడంతో కిడ్నాపర్లు అక్కడి నుంచి పరారయ్యారు. దీనిపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూ టౌన్ సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.


ఈ కేసులో ఏ1 ముద్దాయి జంగారెడ్డిగూడెంకి చెందిన రౌడీ షీటర్ సింగంశెట్టి సత్యరాజ్ కు, నవరాజుకు ఆర్థిక లావాదేవీలు వ్యవహారంలో తగాదాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో  నవరాజును కిడ్నాప్ చేసేందుకు  అయిదుగురు వ్యక్తులను లక్ష రూపాయలు వరకు ఒప్పందం కుదుర్చుకున్నారు.  అయితే ఈ కిడ్నాప్ వ్యవహారం బెడిసికొట్టింది.  దీంతో బాధితుడు కేసు ఆధారంగా దర్యాప్తు చేసి ప్రధాన ముద్దాయి తోపాటు అతనికి సహకరించిన నిమ్మగడ్డ అజయ్ కుమార్, రావూరి మల్లేష్ నాయక్, భానువత్తుల నాగబాబు, భూకే రాజేష్, ప్రొద్దుటూరు మధు లను అరెస్టు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: