రాష్ట్ర ప్రజలకు మంత్రి విడదల రజని ఓ గుడ్‌ న్యూస్ చెప్పారు. వచ్చే ఏడాది ఉగాదిన రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని వెల్లడించారు. జీజీహెచ్ నాట్కో కేంద్రంలో గడ్డిపాటి కస్తూరిదేవి, రామమోహన్రావు, శివరామకృష్ణ సౌజన్యంతో ఏర్పాటు చేసిన డిజిటల్ మామోగ్రాఫి పరికరాన్ని మంత్రి రజని ప్రారంభీంచారు. బ్రెస్ట్ క్యాన్సర్ ను ముందే గుర్తించే మామోగ్రఫీ పరికరాన్నిరాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గుంటూరు జీజీహెచ్ లో అందుబాటులోకి వచ్చిందని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని చెప్పారు.


విశాఖలో క్యాన్సర్ చికిత్సలకు హోమీ బాబా ఆసుపత్రితో ఒప్పందం చేసుకున్నామని  వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని చెప్పారు. క్యాన్సర్ వైద్యం కోసం బయట రాష్ట్రాలకు వెళ్ళకూడదన్న లక్ష్యంతో పని చేస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని రజనీ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: