దేశం శక్తివంతమైన ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ పరిశ్రమలతో పాటు ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల నెట్వర్క్ను కలిగి ఉన్నా పిల్లల పోషకాహార లోపం, తక్కువ జనన బరువుల పరంగా సవాలును ఎదుర్కొంటోందని గవర్నర్ వివరించారు. ఇది అకాల మరణాలు, జీవితకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయన్నారు. ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో ధనవంతులు, పేదల మధ్య, పట్టణ, గ్రామీణ ప్రాంత వాసుల మధ్య అసమానతలు కొనసాగుతున్నాయని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం అందిస్తున్న ఆయుష్మాన్ భారత్ యోజన పేదలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందజేస్తుందని గవర్నర్ తెలిపారు. కార్పొరేట్ సంస్ధలు సామాజిక బాధ్యతగా వ్యాధుల నివారణ కార్యకలాపాలలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలని గవర్నర్ బిశ్వభూషణ్ అన్నారు.
దేశం శక్తివంతమైన ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ పరిశ్రమలతో పాటు ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల నెట్వర్క్ను కలిగి ఉన్నా పిల్లల పోషకాహార లోపం, తక్కువ జనన బరువుల పరంగా సవాలును ఎదుర్కొంటోందని గవర్నర్ వివరించారు. ఇది అకాల మరణాలు, జీవితకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయన్నారు. ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో ధనవంతులు, పేదల మధ్య, పట్టణ, గ్రామీణ ప్రాంత వాసుల మధ్య అసమానతలు కొనసాగుతున్నాయని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం అందిస్తున్న ఆయుష్మాన్ భారత్ యోజన పేదలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందజేస్తుందని గవర్నర్ తెలిపారు. కార్పొరేట్ సంస్ధలు సామాజిక బాధ్యతగా వ్యాధుల నివారణ కార్యకలాపాలలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలని గవర్నర్ బిశ్వభూషణ్ అన్నారు.