ఎనిమిదో నిజాం ముక్రం జా బహదూర్ పార్థివ దేహం ఇవాళ హైదరాబాద్ చేరుకోనుంది.  ఇటీవల ఇస్తాంబుల్‌లో మరణించిన  నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవడు  మక్రమ్ జా బహదూర్ వయస్సు 90 సంవత్సరాలు.  మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆయనను తన వారసుడిగా నియమించారు.1967లో ఆయన మరణానంతరం ముక్రం జా బహదూర్ సింహాసనోత్సవం హైదరాబాద్‌లోని ప్రసిద్ధ చౌమహల్లా ప్యాలెస్ లో జరిగింది. మక్రం జా బహదూర్ చాలా కాలంగా ఇస్తాంబుల్‌లో ఉన్నారు.

మక్రం జా బహదూర్ తాత నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన కాలంలోని ఆదర్శప్రాయమైన లౌకిక వాది. తన ప్రాణం కంటే తన ప్రజలను ఎక్కువగా అభిమానిస్తుండేవారు. హిందువులు, ముస్లింలు తన రెండు కళ్లుగా ఆయన భావించారు. ఉస్మానియా యూనివర్సిటీ , రైల్వే లైన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఆసుపత్రుల ఏర్పాటు వంటి ప్రజా సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజల మన్ననలను పొందారు. నవాబ్ మక్రం జా బహదూర్ కోరిక మేరకు ఆయన పూర్వీకులను ఖననం చేసిన మక్కా మసీదులోనే ఆయనని ఖననం చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: