
కొంతకాలం క్రితం కొన్ని అనివార్య కారణాలు వల్ల ఆత్మహత్య చేసుకున్న ఏన్కూరు పాఠశాల పూర్వ విద్యార్థి (1994 బ్యాచ్) దివంగత బింగి వెంకటేశ్వరరావు (వేంసూరు మండలం, కందుకూరు గ్రామం.) వారి కుటుంబాన్ని ఆదుకోవాలనే సదుద్దేశంతో1994 బ్యాచ్ బి సెక్షన్ విద్యార్థులందరూ (నిక్కర్ మిత్రులు) దయా హృదయంతో స్పందించి, విద్యార్థి దశలో ఉన్న వారి పాప పేరుమీద కొంత నగదును డిపాజిట్ చేయాలనే సంకల్పంతో 80 వేలు రూపాయలు వారి పాప పేరు మీద డిపాజిట్ చేసి, ఫిక్స్ డిపాజిట్ పత్రాలను వారి సతీమణి గారికి ఈరోజు వైరాలో బాల్యమిత్రులు కె.వి అప్పారావు, కిన్నెర ఆనందరావు, ఎస్ శ్రీనివాసరావు, పీవీ సుబ్బారావు, విజయకుమార్, బాల యేసుల సమక్షంలో అందజేశారు.
మా కుటుంబ సభ్యులే మా పిల్లలను పట్టించుకోని సందర్భంలో మా ఆయన గారి మిత్రులైన మీరు అందించిన సహాయం ఎప్పటికీ మరువలేనిది వెంకటేశ్వరరావు సతీమణి అన్నారు. స్నేహితుల కంటే మించిన దైవం లేదని నిరూపించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.