కాంగ్రెస్‌లో కుమ్ములాటల కారణంగా రేపు నల్గొండ మహాత్మగాంధీ విశ్వవిద్యాలయంలో జరగాల్సిన నిరుద్యోగ నిరసన సభ వాయిదా పడింది. రేపు నల్గొండ మహాత్మగాంధీ విశ్వవిద్యాలయంలో జరగాల్సిన నిరుద్యోగ నిరసన సభ నిర్వహించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అయితే.. దీనిపై తమను సంప్రదించలేదని కోమటిరెడ్డి, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. నల్గొండ, భువనగిరి ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కార్యక్రమానికి సంబంధించి తమకు ముందస్తు సమాచారం లేదని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్‌రావ్‌ ఠాక్రే కు కంప్లయింట్ చేశారు.


రేపు  తాము ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయని, మరొక తేదీకి వాయిదా వేయాలని ఎంపీలు విజ్ఞప్తి చేశారు. దీంతో తాత్కాలికంగా రేపటి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందరితో కలిసి చర్చించిన తరువాత మరొక తేదీని ప్రకటిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: