ఇక నేడు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజిలో లాభనష్టాలు విషయానికి వస్తే... ముందుగా అత్యధికంగా లాభపడిన కంపెనీల షేర్ల వివరాలు చూస్తే.. విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బిఐ, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లు అత్యధికంగా లాభపడిన వాటిలో ముందుగా ఉన్నాయి. ఇక ఇందులో అత్యధికంగా విప్రో కంపెనీ నాలుగు శాతం పైగా లాభపడింది. ఇక అత్యధికంగా నష్టపోయిన వాటిలో గ్రాసిమ్, హిందాల్కో, యుపిఎల్, సన్ ఫార్మా, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల షేర్లు అత్యధికంగా నష్టపోయిన వాటిలో ముందుగా ఉన్నాయి. ఇందులో గ్రాసిమ్ కంపెనీకి సంబంధించి అత్యధికంగా 3.2 శాతం షేర్ వాల్యూ నష్టపోయింది.
ఇక నేటి మార్కెట్లో దేశి దిగ్గజ ఐటీ కంపెనీలో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ శుక్రవారం నాడు అసెన్సార్ ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. ప్రస్తుతం టిసిఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 144 . 7 బిలియన్ డాలర్లకు చేరుకుంది.