బ్రిటిష్ కు చెందిన పరిశోధనా సంస్థ " ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ " ఇటీవల ఓ నివేదిక విడుదల చేస్తూ 2035 నాటికి గొప్ప నగరాలుగా రూపొందనున్న 20 నగరాల్లో 17 ఇండియాకు చెందినవేనని పేర్కొంది. శరవేగంతో అభివృద్ధిలో దూసుకెళ్తున్న నగరాలలో బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై లు ఉన్నాయి. అయితే ఈ జాబితాలో పారిశ్రామిక నగరమైన సూరత్ (గుజరాత్ ) 9.17 వృద్ధి రేటు తో అగ్రస్థానాన నిలిచింది. కరోనా సమయంలో కూడ అంత వృద్ధి సాధించడం విశేషం. 



సూరత్ తర్వాత స్థానాలలో ఆగ్రా , బెంగుళూరు, హైదరాబాద్, నాగపూర్ పట్టణాలు ఉన్నాయి. నగరంలో పెట్టుబడి వ్యవస్థ బలంగా ఉంది. వజ్రాలు , వస్త్రాలు , నిర్మాణ పరిశ్రమలు , ఐ.టి మొదలైనవన్ని ఇక్కడ ఎంతగానో  అభివృద్ధి చెందాయి. నగర వాసులలో అత్యధిక శాతం వజ్రాల పరిశ్రమ లో పనిచేసేందుకు కార్మికులు వలస వచ్చినవారే.




బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ లు టెక్ ఆధారిత స్టార్టప్ ఎకోసిస్టం వృద్ధి తో ముందు వరుసలో సాగుతున్నాయి. అంతేకాదు ఈ నగరాలు మేజర్ టెక్, తయారీ రంగం , ఫైనాన్షియల్ సర్వీసెస్ హబ్ లుగా కూడా రూపొందుతున్నాయి. అయితే ప్రపంచంలోని ఇతర మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే, ఇండియన్ నగరాల్లో ఆర్థిక ఉత్పాదన తక్కువే. అయితే మున్ముందు ఈ పరిస్థితి మారుతుందని  సర్వే లో అభిప్రాయం వ్యక్తం అయ్యింది. 2035 నాటికి చైనా నగరాల కంటే 18 శాతం ఎక్కువ ఆర్థిక ఉత్పాదన ఉంటుందన్నారు. 




ప్రపంచంలోని మొదటి 10 పెద్ద నగరాల పరిస్థితి లో పెద్దగా మార్పు ఉండబోదని తెలిపారు. 2025-2035 మధ్య అమెరికా లోని న్యూయార్క్ లీడ్ లో ఉంటే, ఆ తర్వాత టోక్యో , లాస్ ఏంజెల్స్,బీజింగ్, లండన్ , షాంగై నగరాలు నిలుస్తాయి. ఏది ఏమైనా ఇండియన్ నగరాలు సమీప భవిష్యత్తులో అగ్రస్థానాల్లో నిలుస్తాయన్నది సంతోష కర విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: