నాటి నుంచి నేటి వరకు మగువల అందాన్ని పొగడడానికి కవులు సైతం ముందుకొచ్చారు. అలాంటి అమ్మాయి అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి అందం శాశ్వతంగా నిలుపుకోవాలంటే మాత్రం ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అందాన్ని కాపాడుకోవడానికి, మార్కెట్లో దొరికే ఎన్నో రకాల క్రీములు తెచ్చి, వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు. అంతే కాకుండా అందంగా ఉండాలనే కోరిక ఉంటే మాత్రం సరిపోదు, చర్మంపైన శ్రద్ధ వహించాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ఇక బాహ్యచర్మం అందంగా ఉండాలంటే అంతర్గతంగా కూడా ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆశించిన అందం మన సొంతం అవుతుంది. అందుకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మంచి ఆహారం,ఆనందంగా ఉండటం,సరైన సమయానికి నిద్ర పోవడం, వ్యాయామం చెయ్యడం, శరీరానికి సరిపడా నీటిని తాగడం, తాజా పండ్లను కాయగూరలను ఆహారంలో చేర్చుకోవడం, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం, కోపాన్ని తగ్గించుకోవడం, ఇలాంటి పనులు చేయడం వలన చాలా వరకు మీ చర్మం కాంతివంతంగా, మెరుస్తూ ఉంటుంది.
టొమాటో రసం :
వారానికి రెండు లేదా మూడు సార్లు టమోటా రసంతో ముఖానికి పట్టించి, 20 నిమిషాలపాటు ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ రసాన్ని మెడకు, చేతులకు,ముఖానికి, కాళ్లకు పట్టించుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల బయట కాలుష్యానికి మీ చర్మం మొద్దు బారి పోవడం, నల్లగా మారడం, ఉరికి పట్టడం వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు.
రెండు పూటల స్నానమాచరించడం :
రోజుకు రెండుసార్లు ఉదయం, సాయంత్రం స్నానం చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినం,మురికి పోయి శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండవచ్చు.
పచ్చి పాలు :
పచ్చి పాలు ముఖానికి పట్టించి మురికిని తొలగించడానికి బాగా ఉపకరిస్తాయి. పచ్చిపాల ను ముఖానికి అప్లై చేసుకుని, 20 నిమిషాలపాటు ఆరనిచ్చి, చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ పచ్చిపాలు చర్మం లోపలి వరకు వెళ్లి,మురికిని తొలగించడమే కాకుండా చర్మం మెరిసేలా చేస్తాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి