చర్మాన్ని మృదువుగా చేయడంలోనూ, చర్మానికి మెరుపును ఇవ్వడంలోనూ, చక్కటి రంగు తేలేలా చేయడం లోనూ పెసరు చక్కగా పని చేస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. కొద్దిగా పెసరపప్పు తీసుకుని బాగా ఎండబెట్టి పొడిలా చేసుకుని నిలువ చేసుకోవాలి. దీనిని ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలి అనుకున్నప్పుడల్లా ఆ పెసరపిండిని వినియోగించుకోవచ్చు.
* రెండు టీ స్పూన్ల పెసరపప్పు పొడిని తీసుకొని అందులో కాస్త పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిపాలను కలుపుకుంటూ మెత్తటి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఇపుడు ఆ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి. ఆ తర్వాత పదిహేను ఇరవై నిమిషాలకు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి... ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం వలన చక్కటి ఫలితాలను పొందగలరు.
* మూడు టీ స్పూన్ల పెసరపిండి, ఒక టీ స్పూను బియ్యప్పిండి, కొద్దిగా పసుపు వేసి దానికి రోజ్ వాటర్ కలిపి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత ఆ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకుంటూ బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వలన చర్మ రంధ్రాలోని మురికి, బ్యాక్టీరియా పోయి చర్మం కాంతి వంతంగా కనిపిస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ట్రై చేసి చూడండి.