ఒకప్పుడు రజినీకాంత్, మమ్ముట్టి నటించిన దళపతి చిత్రంలో కనిపించిన అరవింద్ స్వామి తర్వాత మణిరత్నం తెరకెక్కించిన ‘రోజా’ చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించాడు.  అప్పట్లో అరవింద్ స్వామి అందనాకి ఎంతోమంది హీరోయిన్లు ఫిదా అయ్యారు.  ఆ తర్వాత మరోసారి మణిరత్నం తెరకెక్కించిన ‘బాంబాయి’ చిత్రంలో నటించాడు.  ప్రస్తుతం అలనాటి హీరోలు ఇప్పుడు యూటర్న్ తీసుకొని విలన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరవింద్ స్వామి కూడా విలన్ అవతారం ఎత్తారు.  ఆ మద్య సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘ధృవ’ చిత్రంలో విలన్ గా కనిపించాడు.  తాజాగా మరోసారి తెలుగులో విలన్ గా కనిపించబోతున్నాడని టాలీవుడ్ లో గుస గుసలు.  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కబోతుంది.

 

 

ఈ మూవీలో అరవింద్ స్వామి విలన్ గా నటించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ హీరోయిన్స్ ను ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.ఇటీవల  కాలంలో స్టైలీష్ విలన్ పాత్రలకు అరవింద్ స్వామి కేరాఫ్ అడ్రెస్ గా మారాడు. ప్రభాస్ చిత్రం కోసం ఫోన్ లోనే అరవింద్ స్వామిని సంప్రదించినట్టు తెలుస్తోంది. ఎలాగూ భారీ ప్రాజెక్టు కావడం తను ఎంతగానో ఇష్టపడే స్టైలీష్ విలన్ పాత్ర కావడం వలన అరవింద్ స్వామి అంగీకరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు.  ప్రభాస్ - అరవింద్ స్వామి తెరపై కనిపిస్తే ఇక రచ్చ రచ్చే అంటున్నారు ఫ్యాన్స్. 

మరింత సమాచారం తెలుసుకోండి: