విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటనపై ఎంతో మంది సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. గ్యాస్ లీక్ దుర్ఘటన బాధితులకు సానుభూతి కూడా తెలుపుతున్నారు ఎంతో మంది సినీ ప్రముఖులు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాసి కన్నా ట్విట్టర్ వేదికగా విశాఖ గ్యాస్ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ బాధితులకు సానుభూతి తెలిపింది . వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనలోనే విజువల్స్ ఎంతగానో భయంకరంగా ఉన్నాయని.. ఆ విజువల్స్ అంతా హృదయవిదారకంగా ఉన్నాయి విచారం వ్యక్తం చేసింది.. నా మనసు ఎంతో బాధాకరంగా ఉంది... అక్కడి కుటుంబాలు ఎంతోమంది తమ ప్రియమైన వారిని కోల్పోయి ఉంటాయి. దేవుని ఒకటే కోరుకుంటున్నాను ఈ ఘటన ద్వారా ఎఫెక్ట్ అయిన వాళ్ళు తొందరగా కోలుకోవాలని దేవుని కోరుకుంటున్నాను అంటూ రాసి కన్నా ట్విట్టర్ వేదికగా విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై సానుభూతి వ్యక్తం చేసింది.
The visuals from the #VizagGasTragedy are so horrifying!
— Raashi (@RaashiKhanna) May 7, 2020
My heart goes out to the families who have lost their loved ones! Praying for speedy recovery of those who have been affected! 🙏🏻🙏🏻