తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలు అందుకుంటున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సెలబ్రెటీలు వరుసగా ట్విట్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ నుంచి ఏదైనా మంచి గిఫ్ట్ వస్తుందని నందమూరి అభిమానులు తెగ ఎదురు చూశారు.. కానీ కరోనా ప్రభావంతో ఎలాంటి స్పెషల్ చేయలేదని ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి తెలిపాడు.  ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా  ప్రముఖ బాలీవుడ్ ఫొటోగ్రాఫర్ డబ్బూ రత్నానీ తీసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్ పై సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ప్రశంసలు కురిపించారు.

 

ఇదే సమయంలో తారక్ గురించి తనదైన శైలిలో వరుస ట్వీట్లు చేశారు. 'వామ్మో... సూపర్. అదిరిపోయింది. బతకాలంటే బాద్షా కిందుండాలి. చావాలంటే బాద్షా ముందుండాలి. భయపడేవాడు బానిస. భయపెట్టే వాడు బాద్షా. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది. అయ్య డిసైడ్ అయ్యాడు. అందుకే వార్ వన్ సైడ్ చేశాడు. చచ్చిన జంతువును సింహం ముట్టడు. భయపడే మనిషిని బాద్షా చంపడు'  అంటూ బాద్ షా చిత్రంలోని డైలాగ్స్ వదిలాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: