కృష్ణా జిల్లాలో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. రాయనపాడుకు చెందిన రైల్వే కీమేన్‌ రాజు పురుగులమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లగా స్థానికులు ఆ వ్యక్తిని రైల్వే ఆస్పత్రికి తరలించారు. రాజు రైల్వే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం కన్నుమూశాడు. అధికారుల వేధింపుల భరించలేక ప్రాణాలు తీసుకుంటున్నట్లు ఉద్యోగి సెల్ఫీ వీడియో ద్వారా ఆవేదనను వ్యక్తం చేశాడు. సెల్ఫీ వీడియోలోనే పురుగుల మందు తాగాడు. 

 

పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. రాజుపై వేధింపులకు పాల్పడిన అధికారులు ఎవరో తెలియాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తు తరువాత ఈ కేసులో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: