లాక్ డౌన్ సమయంలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల కోసం సోనూసూద్ బస్సులు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కేరళలో చిక్కుకున్న కొంతమంది కార్మికుల కోసం విమానాలను కూడా బుక్ చేశారు. దేశవ్యాప్తంగా సోనూసూద్ పై ప్రశంసలు వ్యక్తమయ్యాయి. అయితే శివసేన మాత్రం ‘సామ్నా’ వేదికగా సోనూసూద్ పై తీవ్ర విమర్శలు చేసింది. సోనూసూద్ త్వరలోనే సెలెబ్రిటీ మేనేజర్ ఆఫ్ ముంబై’ గా అయిపోతారని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు. 
 
సోనూసూద్ ను ఉద్దేశించి కరోనా సమయంలో కొత్త మహాత్ముడు ఊడిపడ్డాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ కోషియారీ కూడా ‘మహాత్మా సూద్’ అని ప్రశంసించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. లాక్‌డౌన్ సమయంలో అన్ని బస్సులను సోనూసూద్ ఎలా అందుబాటులోకి తెచ్చాడో ఎవరూ ప్రశ్నించలేదని... ఆయన పంపించిన వలస కార్మికులను పలు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించలేదని... అలాంటి సమయంలో వారెక్కడికి వెళ్లాలో చెప్పాలని విమర్శలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: