టీడీపీ కీలక నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ పై తాజాగా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. అచ్చం నాయుడు జగన్ సర్కార్ పాల్పడుతున్న అవినీతి పై పోరాడుతున్నారు అనే  కక్షసాధింపు చర్యల్లో భాగంగా అక్రమంగా కేసులు బనాయించి ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టు చేయించారని ఆరోపించారు చంద్రబాబు నాయుడు. 

 

 అచ్చన్నాయుడు విచారణకు హాజరు కాను అని చెప్పలేదు కదా అలాంటప్పుడు ఎందుకు అరెస్టు చేశారు అంటూ ప్రశ్నించారు. కనీస సమాచారం ఇవ్వకుండా ఒక శాసన సభ్యుడిని  అరెస్టు చేసి రాజ్యాంగ నిబంధనలు జగన్ సర్కారు తుంగలో తొక్కిందని చంద్రబాబునాయుడు ఆరోపించారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వ హయాంలో బ్లీచింగ్ పౌడర్ లో సైతం అక్రమాలకు పాల్పడే దుస్థితి ఏర్పడింది అంటూ ఆరోపించారు చంద్రబాబు నాయుడు. అచ్చన్నాయుడు అరెస్టుకు నిరసనగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: