ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి అచ్చన్నాయుడు అరెస్టు చేయడం పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కార్మికశాఖ మంత్రిగా ఉన్న అచ్చన్నాయుడు 150 కోట్ల ఈఎస్ఐ స్కాం కి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేస్తూ... అచ్చన్నాయుడు ను  అరెస్టు చేసి జైలుకు తరలించడం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. ఇక దీనిపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. 

 


 అచ్చెన్నాయుడు అరెస్ట్ పై స్పందిస్తూ తాజాగా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహిస్తూ అచ్చెన్నాయుడు అరెస్టును తీవ్రంగా ఖండించారు. విజిలెన్స్ అధికారులు ఇచ్చిన రిపోర్టులో అచ్చెన్నాయుడు పేరు లేకపోయినప్పటికీ కూడా అక్రమంగా కేసులు బనాయించి... జగన్ సర్కార్ కక్షసాధింపు చర్యల్లో భాగంగా అచ్చన్నాయుడు ని అరెస్టు చేసింది అంటూ ఆరోపించారు. దీనిపై తాము పోరాటానికి సిద్ధం అంటూ ఈ సందర్భంగా వాఖ్యానించారు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: