టీడీపీ నేత బోండా ఉమ టీడీపీ నాయకులను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందని... హత్య చేయడం కోసం కొన్ని స్పెషల్ టీంలను ఏర్పాటు చేసినట్లు సమాచారం అందుతోందని వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే తమకు చాలా మంది వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని అన్నారు. 
 
పోలీసులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన తమ మొర ఆలకించటం లేదని వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి బయటకు వెళ్లే కారు ఎక్కేలోపు వారికి వేరువేరు నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.... జూన్ 22 లోపు నన్ను చంపుతామని డెడ్ లైన్ పెట్టారని వ్యాఖ్యలు చేశారు. తనకు రోజులు లెక్క పెట్టుకోండని చెబుతున్నారని.... మీడియా ముందు చెప్పలేని పదజాలంతో సోషల్ మీడియాలో దూషిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: