తెలంగాణ రాష్ట్రంలో టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి కరోనా భారీన పడ్డారు. ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గాంధీభవన్‌ వర్గాలు ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. గాంధీభవన్‌ వర్గాలు నారాయణరెడ్డికి కరోనాకు సంబంధించిన స్వల్ప లక్షణాలే ఉన్నాయని... త్వరలోనే ఆయన కోలుకుంటారని తెలిపాయి. 
 
గూడూరు నారాయణరెడ్డి కరోనా నిర్ధారణ అయిన తరువాత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా కమ్యూనిటీ వ్యాప్తి జరిగిందని చెప్పడానికి తన కేసే ఉదాహరణ అని అన్నారు. తాను ఇటీవల విదేశాలకు గానీ, ఇతర ప్రదేశాలకు గానీ ప్రయాణం చేయలేదని...... పాజిటివ్ ‌ వచ్చిన వ్యక్తులను, వారికి సన్నిహితంగా ఉన్నవారిని కూడా కలవలేదని... అయినా కరోనా సోకిందంటే రాష్ట్రంలో కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: