కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం అఖిలపక్ష సమావేశంలో నరేంద్రమోడీ ఇచ్చిన స్టేట్మెంట్ పై అనుమానాలు వ్యక్తం చేస్తూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. లడక్ లోని  ఇండియా భూభాగంలో ఇతరులెవరూ అడుగుపెట్టలేదు అంటూ ప్రధాని మోడీ గాల్వాన్ లో ఘర్షణ  ప్రస్తావన సందర్భంగా అన్నారు దానిపై స్పందించిన చిదంబరం.... ప్రధాని మోడీ ఇచ్చిన స్టేట్మెంట్ అంతకుముందు ఆర్మీ చీఫ్,  డిఫెన్స్ మినిస్టర్, విదేశాంగమంత్రి చెప్పిన వ్యాఖ్యలకు పూర్తిగా విరుద్ధంగా ఉందని విమర్శించారు. 

 


 అంత మంది సైనికులు అమరులు అవ్వడానికి కారణం ఏమిటి అంటూ ప్రశ్నించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలందరినీ గందరగోళం లో పడేశారు అని చిదంబరం ఆరోపణలు చేశారు. చైనా బలగాలు మన భూభాగంలోకి రాకపోతే సైనికులు ఎలా చనిపోయారు అంటూ ప్రశ్నించారు. మోడీ చైనాకు భారత భూభాగాన్ని అప్పజెప్పారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: