విశాఖపట్నంలో సెల్ ఫోన్ టవర్ ఎక్కి ఒక యువకుడి హల్చల్ చేశాడు. నగరంలోని కసింకోట పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ యువకుడు సెల్ ఫోన్ టవర్ ఎక్కాడు, తనపై బుల్లిబాబు అనే వ్యక్తి తప్పుడు ఆరోపణలు చేస్తూ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడు అంటూ ఆరోపించాడు సదరు యువకుడు, 

 

 అయితే బుల్లిబాబు అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన వెంటనే ఎలాంటి విచారణ కూడా చేయకుండా పోలీసులు తనపై కేసు నమోదు చేశారు అంటూ యువకుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇక ఈ విషయమై పోలీస్ స్టేషన్  రెవెన్యూ కార్యాలయానికి తిరిగిన అధికారులు ఊరికే తిప్పుతున్నారని ఆవేదనకు గురై యువకుడు నిరసన వ్యక్తం చేశాడు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన టవర్ వద్దకు వెళ్లి ఆ యువకుని కిందకు దింపేందుకు  ప్రయత్నించారు.  ఇసుక విషయంలో తలెత్తిన వివాదం దీనికి కారణం అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: