ఎన్సీపీ నేత శరద్ పవార్‌కు ఈరోజు తృటిలో ప్రమాదం తప్పింది. ముంబై- పుణె మధ్య ఉన్న ఎక్స్‌ప్రెస్‌వే పై ఆయన వెళుతున్న సమయంలో కాన్వాయ్‌లోని ఓ వాహనం బోల్తా పడింది. బోల్తా పడిన వాహనంలోని డ్రైవర్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈరోజు మధ్యాహ్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే శరద్‌పవార్ వాహనం దాటి వెళ్లడంతో తృటిలో ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. 
 
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పుణే జిల్లా రూరల్ పోలీసులు గాయాలపాలైన డ్రైవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాల గురించి దర్యాప్తు జరుపుతున్నారు. తృటిలో ప్రమాదం తప్పడంతో పార్టీ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: