ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరిగి పోతున్న విషయం తెలిసిందే. అయితే భారతదేశంలో అత్యధిక కరోనా కేసులు ఉన్న రాష్ట్రంగా మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.
అయితే తాజా గణాంకాల ప్రకారం అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదవుతుండగా.. అదే స్థాయిలో తెలంగాణలో కేసులు నమోదవుతున్నాయి, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 85, 106 కరోనా టెస్టులు చేస్తే 15 వేల 394 మందికి పాజిటివ్ అని తేలింది. అంటే చేసిన టెస్టులు కేసుల లెక్కల ప్రకారం చూస్తే పాజిటివ్ కేసులు శాతం 18% ఉంది , మహారాష్ట్రలో టెస్టులు కేసుల సంఖ్య పోల్చిచూస్తే అక్కడ కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు శాతం 18 గా ఉంది