ఈ మద్య చిన్న చిన్న వివాదాలు చివరికి హత్యల వరకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా భూ తగాదాలు, ఇల్లీగల్ వ్యవహారాల్లో ఇలాంటి దారుణాలు విపరీతంగా పెరిగిపోయాయి.  తాజాగా  భూవివాదాలు శ్రీకాళహస్తి లో కలకలం రేపుతున్నాయి. ఓ భూ  వివాదానికి సంబంధించి ఇద్దరీ  దళిత యువకులపై హత్యాయత్నం జరగడం పట్టణంలో కలకలం రేగింది. శ్రీకాళహస్తి ఎం ఎం వాడకు చెందిన కిరణ్,  నరసింహులు అనే యువకులు పిచ్చాటూరు మార్గంలో రాజీవ్ నగర్ సమీపంలో వెళ్తుండగా వారి పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడులకు పాల్పడ్డారు.

 

ఈ దాడిలో ఆ యువకులకు తీవ్రంగా దెబ్బలు తాకాయి. స్థానికులు వెంటనే వారిని  ఏరియా హాస్పిటల్ కు తరలించారు. తీవ్రంగా గాయపడిన యువకులకు ఏరియా హాస్పిటల్ లో వైద్య చికిత్సలు అందిస్తున్నారు. పోలీసులు ఘటనకు సంబంధించి బాధితుల నుంచి ఫిర్యాదులు  స్వీకరించి దర్యాప్తు చేపట్టారు. బాధితులు  కిరణ్ నరసింహులు విలేకరులతో మాట్లాడుతూ తమ పై  అగ్రవర్ణాలకు చెందిన వారు హత్యాయత్నం చేయించారని ఆరోపించారు.పట్టణంలోని దళితులకు చెందిన భూమి ఆక్రమించుకోవడంతో తాము అభ్యంతరం చెప్పగా  తమ పై హత్యా ప్రయత్నం చేయించారని బాధితులు వాపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: