పబ్జి వల్ల యూత్ ఇటీవలే ఎన్నో నేరాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సొంత కుటుంబీకులనే మోసం చేస్తూ భారీగా డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు ఇలాంటిదే చేశాడు. పబ్ జీ ఎడిక్ట్ అయిపోయి .. యాప్ ఫర్చేస్ కోసం తాత అకౌంట్ నుంచి రెండు లక్షల రూపాయలు కాజేశాడు.
ఇక ఇటీవల తాత తన అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకో గా రెండు లక్షలు మాయమయ్యాయి. ఇక సదరు యువకుడు సీనియర్ విద్యార్థి ఇచ్చిన సమాచారం మేరకు తన మనవడు ఖాతా నుంచి డబ్బులు కాజేసినట్లు తేలింది ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.