న‌ర్సాపురం పార్ల‌మెంటు స‌భ్యుడు రాఘురామ కృష్ణంరాజు కేసు ఆస‌క్తిక‌రంగా మారింది. సుప్రీంకోర్టులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.  బెయిల్ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. రఘురాజును ఆసుపత్రికి తరలించడంపై మధ్యాహ్నం ఒంటిగంటకు తుది ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: