ప్రముఖ ఔషధ  సంస్థ ఐనా అరబిందో ఫార్మాకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) భారీ షాక్ . హైదరాబాద్ శివారులోనీ అరబిందో సంస్థ యూనిట్ 7లో తనిఖీలు నిర్వహించి 7 లోపాలను గ్రహించారు. అరబిందో ఫార్మాతో పాటు హిమాచల్ ప్రదేశ్‌లోని మరో ఫార్మా సంస్థ గ్లెన్‌మార్క్‌కు కూడా వార్నింగ్ లేఖ ఇచ్చింది. వార్నింగ్ లేఖ ఇచ్చినప్పటికీ, ఈ కంపెనీలు అమెరికాకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవచ్చు అని కూడా తెలిపారు.


అమెరికాకు ఎగుమతి అయ్యే ఉత్పత్తుల ద్వారా అరబిందో ఫార్మాకు 25 నుంచి 30 శాతం ఆదాయం, గ్లెన్‌మార్క్‌కు 7 శాతం ఆదాయం లభిస్తుంది. అరబిందో ఫార్మా హెడ్ క్వార్టర్ హైదరాబాదులో ఉంది. అమెరికాకు ఎగుమతి చేసే జనరిక్ కంపెనీల్లో అయిదో పెద్ద కంపెనీ. అమెరికా నుంచి దాదాపు రూ.9,030 కోట్ల రెవెన్యూ కూడా వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అమెరికా మార్కెట్ రెవెన్యూ 50 శాతం వరకు ఉంటుందని అనుకుంటున్నారు. 


USFDA షాక్ నేపథ్యంలో ఈ కంపెనీల షేర్లు భారీ నష్టం వచ్చాయి. అరబిందో ఫార్మా షేర్లు 20 శాతం నష్టపోయి అయిదేళ్ల కనిష్టానికి చేరుకున్నాయి. చివరకు రూ.458.50 వద్ద ముగిసి పోయింది. గ్లెన్‌మార్క్ స్టాక్స్ 52 వారాల కనిష్టానికి చేరుకొని రూ.286.3 వద్ద ముగిశాయి. కాగా, ఈ యూనిట్‌ను గత నెలలో USFDA తనిఖీ చేసి ఏడు అభ్యంతరాలు తెలిపినట్లు అరబిందో ఫార్మా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌కు  తెలియచేసింది. దీంతో షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.


ఇదిలా ఉండగా, హైదరాబాదులోని తమ ప్లాంట్ యూనిట్లో USFDA లేవనెత్తిన అభ్యంతరాలను గడువులోగా పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తామని అరబిందో ఫార్మా కంపెనీ తెలియచేసారు. డేటా ఇంటిగ్రిటీకి సంబంధించిన అభ్యంతరాలు లేవని తాము అనుకుంటున్నాము, అయినప్పటికీ అభ్యంతరాలను సాధ్యమైనంత తొందరగా సరిదిద్దుకుంటామని తెలిపారు. అభ్యంతరాలు సరిదిద్ది USFDAకు రిపోర్ట్ కూడా మీకు ఇస్తాము అని తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: