ప్రముఖ పారిశ్రామికవేత్త
ముఖేష్ అంబానీ ఇంట వివాహమైన, ఇతర వేడుక అయిన చాల రిచ్ గా ఉంటాయి. శ్రీమతి నీతా అంబానీ సారధ్యంలో
రిలయన్స్ ఫౌండేషన్ సమాజాన్ని మార్చే అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
విద్య, క్రీడలు, గ్రామాల అభివృద్ధి ప్రోత్సహించడం మరియు
ప్రకృతి విపత్తులు తగ్గించేందుకు ఫౌండేషన్ కృషి చేస్తుంది.
ఇందులో భాగంగా భారత క్రికెటర్లకు ఈ
దీపావళి కానుకగా విందును అందించారు అంబానీ కుటుంబం. ఈ కార్యక్రమానికి ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాళ్లకు ఆహ్వానం అందింది.
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ముంబై ఇండియన్స్ జట్టుకు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత
ముఖేష్ అంబానీ జియో వరల్డ్ సెంటర్లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఆటగాళ్లు
రోహిత్ శర్మ, జహీర్ ఖాన్,
యువరాజ్ సింగ్ తదితరులు వారి సతీమణులతో ఈ వేడుకకు హాజరయ్యారు.
వీరితోపాటు హారతి పాండ్యా, మహితా జయవర్ధనే, ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా,
ఆనంద్ పిరమాల్,
అజయ్ స్వాతి పిరమాల్ కూడా పాల్గొన్నారు. ఈ విందులో పాల్గొనేందుకు
ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీతో పాటు కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు.
దేశంలోనే అత్యంత ధనవంతుడైన
ముకేశ్ అంబానీ గారాలపట్టి ఇషా అంబానీ తళుకుమని మెరిశారు. ప్రి
దీపావళి కార్యక్రమంలో ఈమె బెనారస్ చీరలో అందరి మతిని పోగొట్టారు. సాంప్రదాయ అలంకరణతో ప్రతి ఒక్కరి మనన్నలు అందుకున్నారు.
కేవలం అంబానీ కుటుంబీకులు మాత్రమే కాదండోయ్.. ఇషా అంబానీ చీరకు నెటిజన్లు కూడా ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో చీర కట్టులో ఇషా అంబానీ అదిరిపోయారని మెచ్చుకుంటున్నారు. ఎంతో అందంగా ఉన్న పొగడ్దలతో ముంచెత్తుతున్నారు.
అలాగే ఇషా ఫోటోలు చూసి నెటిజన్లు.. ఒదిగి ఉండాలి, ప్రతి ఒక్క కూతురు ఇషా మాదిరి విలువలు కలిగి ఉండలి,
ఆమె నవ్వు ఎంతో బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఇషా బెనారస్ చీర ఫోటోలకు ఇన్స్టాగ్రామ్లో ఏకంగా వేలల్లో లైక్స్ వచ్చాయి.