బంగారం సామాన్యుడికి బహు దూరం అయ్యింది. మధ్యతరగతి వాళ్ళము.. ప్రస్తుతం కొనగలమా? అనే ఆలోచనలో పడేశాయి ప్రస్తుతం బంగారం ధరలు. ఒకప్పుడు ధరలు పెరిగినా మళ్లీ తగ్గేవి కానీ ఇప్పుడు అలా కాదు.. భారీగా అంటే భారీగా పెరుగుతాయి.. ఏమాత్రం తగ్గవు ఈ బంగారం ధరలు. నిన్న మొన్న తగ్గాయి కానీ ఈరోజు మళ్లీ పెరిగాయి.  

 

అయితే బంగారం ధర ఈ ఒక్క సంవత్సరంలోనే 25 శాతం ధర పెరిగింది. అందుకే సామాన్యులు బంగారం అంటే భయపడుతున్నారు. అయినప్పటికీ ఏదైనా పండగ అంటే చాలు బంగారం కొనేస్తారు. మన భారతీయులు. ఈ నేపథ్యంలోనే నేడు సోమవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిల పెరుగుదలతో 43,670 రూపాయలకు చేరింది. 

 

అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయిల పెరుగుదలతో 39,870 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగింది. దీంతో నేడు కేజీ వెండి ధర 48,500 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. 

 

అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలుదారుల నుండి డిమాండ్ భారీగా పెరగటంతోనే బంగారంపై ఈ ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఇలాగే కొనసాగుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: