కరోనా వైరస్.. ప్రపంచాన్ని ఎలా నాశనం చేసింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజు రోజుకు అత్యంత దారుణంగా పెరుగుతున్న ఈ కరోనా వైరస్ ను నియంత్రించేందుకు లాక్ డౌన్ పెట్టినప్పట్టికి ఉపయోగం లేకుండా పోయింది. చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ మనుషుల జీవనాన్ని మార్చేసింది. 

 

వర్క్ ఫ్రామ్ హోమ్ ఒక్కరోజు ఇవ్వండి అని అడిగిన సరే ఇవ్వని బాసులు ఉన్న ఈరోజుల్లో కరోనా దెబ్బకు గత మూడు నెలలుగా వర్క్ ఫ్రామ్ హోమ్ ఇచ్చేశారు. సరే.. వీళ్ళు అంత ఓకే. ఇంకా ఈ కరోనా వైరస్ కారణంగా స్కూళ్ళు, కాలేజీలు, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా మూసేశారు.. దీంతో ఇప్పుడు పిల్లలు అంత కూడా ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ కి అలవాటు పడుతున్నారు. 

 

ఇంకేముంది.. ఒక్కసారిగా ఆన్‌లైన్ క్లాసులకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. డబ్బు సంపాదించాలని అనుకునే వారికి ఒక మంచి ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. రోజుకు కేవలం అంటే కేవలం మూడు గంటలు పని చేస్తే చాలు నెలకు 40 వేల రూపాయిలు సంపాదించచ్చు. పిల్లలకు కేవలం అంటే కేవలం రోజుకు 3 గంటలు పాటు ట్రైనింగ్ ఇస్తే నెల తిరిగే సరికి మీ అకౌంట్ లో డబ్బులే డబ్బులు. 

 

పిల్లలకు 3 గంటలు ఆన్‌లైన్ పాఠాలు చెప్పడం, అలాగే టీచర్లకు 2 గంటలపాటు స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా నెలకు 40 వేల వరకు సంపాదిస్తున్నారు. అయితే ఇలా చెయ్యడానికి ఒక కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలి. అదే క్యూమ్యాథ్. దీనికి దేశవ్యాప్తంగా 3 వేలకు పైగా సెంటర్లు ఉన్నాయి. డబ్బు సంపాదించాలంటే ముందుగా ఈ కంపెనీలో మెంబర్ అవ్వాలి. దీని కోసం కంపెనీ వెబ్‌సైట్‌కు వెళ్లి టీచర్‌గా రిజిస్టర్ చేసుకోవాలి. 

 

టెస్ట్, ఇంటర్వ్యూ రెండు ఉంటాయి. ఎంపిక అయితే టీచర్ సభ్యత్వం లభిస్తుంది. దీనికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 10వ తరగతి వరకు మ్యాథ్స్ చెప్పగలగాలి. మీకు కంపెనీ ట్రైనింగ్ కూడా ఇస్తుంది. దీనికి రూ.6,000 చెల్లించాల్సి ఉంటుంది. అంతే మీరు టీచర్ అయిపోవచ్చు. డబ్బులు సంపాదించచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: