కేంద్ర పథకం అటల్ పెన్షన్ యోజనలో పదవీ విరమణ అనంతర జీవితం కోసం స్వచ్ఛందంగా పొదుపు చేసుకునేలా ఈ స్కీం ప్రోత్సహిస్తోంది. ఇక 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసు గల భారతీయ పౌరులెవరైనా కానీ ఈ స్కీమ్ కింద తమ పేరును నమోదు చేసుకునే అర్హత ఉంటుంది.60 ఏళ్లు వయసు నిండిన నాటి నుంచి ఈ స్కీమ్ కింద వారికి నెలకు రూ. 1000 నుంచి రూ.5000 కనీస పింఛనుకు ఇది హామీ ఇస్తుంది. ఈ అటల్ పెన్షన్ యోజన కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న పథకాలలో బాగా పాపులర్ అయింది. ఇక 2021-22లో ఈ స్కీమ్‌లో 64 లక్షల మంది చేరారు. ఇప్పటికే ఈ స్కీమ్‌లో చేరిన వారి సంఖ్య మొత్తం 3.68 కోట్లుగా నమోదు కావడం విశేషం.ఈ స్కీమ్‌లో భార్యాభర్తలు ఇద్దరూ కూడా చేరొచ్చు. అలాగే ఇద్దరికీ 60 ఏళ్ల వయసు నుంచి నెలకు రూ.5 వేల చొప్పున పెన్షన్ వస్తుంది. అంటే భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఈ స్కీమ్ ద్వారా నెలకు రూ.10 వేల పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. వారి వయసు ఎంత తక్కువగా ఉన్నప్పుడు ఈ స్కీమ్‌లో చేరి, పొదుపు చేస్తే అంత ఎక్కువ లాభం వస్తుంది.ఇక 18 ఏళ్లు ఉన్నప్పుడు చేరితే నెలకు రూ.42 నుంచి రూ.210 వరకు కూడా కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది.


అలాగా వయసు పెరుగుతున్న కొలది ఈ మొత్తం పెరుగుతూ ఉంటుంది. ఈ అటల్ పెన్షన్ స్కీమ్ కింద కనీసం 20 ఏళ్లు కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది.ఇక ఆన్‌లైన్‌గా లేదా బ్యాంకుల వద్ద అటల్ పెన్షన్ దరఖాస్తు ఫామ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని డౌన్‌లోడ్ చేసుకుని, అవసరమైన సమాచారమంతా కూడా నింపాలి.అలాగే వాలిడ్ మొబైల్ నెంబర్‌ తో పాటు..ఇంకా ఆధార్ కార్డు ఫోటోకాఫీని కూడా ఇవ్వాలి.ఇక అప్లికేషన్ అప్రూవల్ అయిన తర్వాత మీకు కన్‌ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.మీకు రూ.1000 పింఛన్ రావాలంటే.. నెలకు రూ.42 కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది.అలాగే రూ.5 వేలు పెన్షన్ కోసం నెలకు రూ. 210 మీరు కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది.ఇక అదే త్రైమాసికంగా రూ. 626 ఇంకా అర్థవార్షికంగా రూ. 1,239 కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అలాగే నామినీకి ఏక మొత్తంలో రూ. 8.5 లక్షలు చెల్లిస్తారు. ఈ రకంగా భార్యాభర్తలకు మొత్తం రూ. 10 వేలు పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: