ఇక కార్డును ఆధార్‌ కార్డుతో లింక్‌ చేసుకోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆధార్‌ ఇంకా పాన్‌ కార్డ్‌ లింక్ చేయడాన్ని తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం ఆధార్‌కార్డు అలాగే రేషన్‌ కార్డును కూడా లింక్‌ చేయాలని తెలిపింది.ఇంకా ఈ రేషన్‌ కార్డు ద్వారా సబ్సిడీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యం, గోదుమలు వంటి నిత్యావసర సరుకులు అందిస్తాయనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రేషన్‌ మోసాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధార్‌ కార్డుతో రేషన్‌ కార్డు లింక్‌ చేయాలనే నిబంధన తీసుకొచ్చింది.అందుకు నిజంగా అర్హత ఉన్న వారికే లబ్ధి చేకూరడంతో పాటు, డూప్లికేట్‌ రేషన్‌ కార్డులను గుర్తించవచ్చనేది కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం.ఇక ఇదిలా ఉంటే ఆధార్‌ కార్డ్‌, రేషన్‌ కార్డును లింక్‌ చేయడానికి మొదట కేంద్ర ప్రభుత్వం మార్చి 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించింది. అయితే తాజాగా ఈ డెడ్‌లైన్‌ను పొడగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఓ మంచి నిర్ణయం ప్రకటించింది.


ఆధార్‌, రేషన్‌ కార్డ్‌ లింకేజ్‌ డెడ్‌లైన్‌ను జూన్ 30 వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ తాజాగా ఓ నోటిఫికేషన్ ని కూడా జారీ చేసింది. ఇదిలా ఉంటే ఆన్‌లైన్‌లోనే మీ రేషన్‌ కార్డు ఇంకా ఆధార్‌ కార్డును సింపుల్‌ స్టెప్స్‌ ద్వారా లింక్‌ చేసుకోవచ్చు.ఆన్లైన్ లో ఆధార్, రేషన్ కార్డు లింక్ చేసుకోవడం కోసం ముందుగా స్టేట్స్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ (పీడీఎస్‌) పోర్టల్‌లోకి వెళ్లాలి.ఆ తరువాత ఆధార్‌ కార్డు నెంబర్‌, రేషన్‌ కార్డ్‌ నెంబర్‌, రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌ వంటి వివరాలను అందించాలి.ఇక ఆ తర్వాత మీ రిజిస్టర్‌ మొబైల్ నెంబర్‌కి వచ్చిన ఓటీపీని మీరు ఎంటర్‌ చేయాలి.ఇక ఇలా మీరు ఆధార్‌ కార్డును, రేషన్‌ కార్డుతో లింక్‌ చేసుకోవచ్చు.ఆఫ్‌లైన్‌ లో అయితే ఇంట్లో ఉన్న అందరి ఆధార్ కార్డుల జిరాక్స్‌లను, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ ఇంకా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో వంటివి వాటిని రేషన్ ఆఫీస్‌కు లేదా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేదా రేషన్ షాపు యజమానికి అందిస్తే సరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: