మీరు సదూర రైలులో ప్రయాణం చేస్తున్నారా? మీరు మీ బెర్త్ రిజర్వ్ చేసుకున్నారా? మీరు ఏదైనా స్టేషన్ నుండి రైలులో వెళ్లాలని ఆలోచిస్తున్నారా? అయితే ఆ రోజులన్నీ  కూడా ఇప్పుడు ముగిసిపోతున్నాయి.ఇండియన్ రైల్వే ఒక స్ట్రిక్ట్ నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పుడు సమయాన్ని లెక్కించబోతోంది. మీరు రైలు ఎక్కాల్సిన ప్రదేశం నుండి 10 నిమిషాలలోపు మీ సీటులో ఖచ్చితంగా కూర్చోవాలి. లేదంటే మీ బుకింగ్ అనేది రద్దు చేయబడవచ్చు. ఈసారి రైల్వే శాఖ ఇలా కొన్ని కఠిన నిబంధనలు రూపొందిస్తోంది. దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ అంటే అది రైల్వే అని అందరికి తెలుసు. ప్రతి రోజు ఎన్నో లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. అయితే ప్రయాణికులు ముందస్తుగానే ఐఆర్‌సీటీసీ ద్వారానో ఇతర ఆన్‌లైన్‌లో ఇంకా రైల్వే టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌లోనే బుక్‌ చేసుకుంటారు. అయితే ఇండియన్‌ రైల్వే ఇప్పుడు కొత్త నిబంధనలని తీసుకురాబోతోంది.చాలా దూరం ప్రయాణించే రైలు ప్రయాణీకులలో ఖచ్చితంగా చెడు అలవాటు ఉంది. వారు రైలు ప్రారంభ స్టేషన్ నుండి బోర్డింగ్ రిజర్వ్ చేసుకుంటారు. కానీ రెండు లేదా మూడు స్టేషన్లు దాటిన తర్వాత ఆ రైలు ఎక్కుతుంటారు.


ఉదాహరణకు ఒక వ్యక్తి హౌరా లేదా సీల్దా స్టేషన్ నుండి బోర్డింగ్ రిజర్వ్ చేశారనుకుందాం.. కానీ అతను బండేల్ లేదా బుర్ద్వాన్ లేదా మరేదైనా స్టేషన్ నుండి రైలుని ఎక్కుతారు. ఇటువంటి అలవాటు చాలా మంది ప్రయాణికుల్లో కూడా కనిపిస్తుంది. అయితే ఈ విధానాన్ని మార్చాలని ఇండియన్ రైల్వే చెబుతోంది.ఇక కొత్త రైల్వే నిబంధనల ప్రకారం.. మీరు నిర్దేశించిన సమయానికి 10 నిమిషాల లోపు గనుక మీరు మీ సీటును చేరుకోకపోతే మీరు ఖచ్చితంగా ఇబ్బందిని ఎదుర్కోవలసి ఉంటుంది. ఎందుకంటే, నిర్దిష్ట బోర్డింగ్ పాయింట్ తర్వాత టికెట్ చెకర్ ఒక 10 నిమిషాలు వేచి ఉంటాడు. మీరు అప్పటికి మీ సీటుకు చేరుకోకపోతే టిక్కెట్ చెకర్ మీ సీటును ఖాళీగా ఉన్నట్లుగా గుర్తిస్తారు.ఇక సుదూర రైళ్లలో చాలా మంది ప్రయాణికులు టికెట్‌లో పేర్కొన్న స్టేషన్‌కు బదులుగా తదుపరి స్టేషన్ నుండి రైలుని ఎక్కుతారు. అలాంటప్పుడు ఏ సీటులో ప్రయాణీకులు ఉన్నారో లేదా ఏ సీటు ఖాళీగా ఉందో గుర్తించడంలో టికెట్ చేసే చేసే వారికి ఖచ్చితంగా సమస్య ఏర్పడుతుందట.అందుకే భారతీయ రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: