ఇటీవలి కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే.. అసలు సభ్య సమాజంలో మానవత్వం ఇంకా బ్రతికి ఉందా అన్న అనుమానం కలుగకమానదు. మనుషులు కాస్తా క్రూరమృగాల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది పగలు ప్రతీకారంతో ఏం చేస్తున్నామో కూడా తెలియక దారుణాలకు పాల్పడుతున్నారు. ఇటీవలే ఒక మహిళ తనను అవమానాలకు గురి చేసిందని పగతో రగిలిపోయే మరో మహిళ గత రెండు నెలల పసికందు నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీసింది.


 ఈ ఘటన మరువకముందే ఇలాంటి మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పిల్లల మధ్య జరిగిన చిన్నపాటి గొడవను ఏకంగా తల్లిదండ్రులు పెద్దది చేశారు.దీంతో ఒకరిపై ఒకరు పగలు పెంచుకున్నారు. చివరికి వీరి పగకు ఒక నాలుగు నెలల చిన్నారి బలైన ఘటన హర్యానాలో  వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని పానిపట్ ఈ ప్రాంతంలో వినోద్ కుటుంబం స్థిరపడింది.వినోద్ కి ఎనిమిదేళ్ల రాఖీ అనే కూతురు తో పాటు నాలుగు నెలల కొడుకు కూడా ఉన్నాడు. అయితే ఇటీవల 8 ఏళ్ల కూతురు రాఖి పక్కింటి బాలిక శాలిని తో ఆడుకుంటూ సందర్భంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇక ఆ సమయంలోనే ఇద్దరు చిన్నారుల తల్లుల మధ్య గొడవ జరిగింది.


 అయితే షాలిని తల్లి ఈ గొడవ మనసులో పెట్టుకుని సమయం చూసి వారిపై పగ తీర్చుకోవాలని అనుకుంది. ఈ క్రమంలోనే  రెండు రోజుల క్రితం రాఖీ తల్లి ఇక నీటి కోసం  బయటకు వెళ్లింది. ఆ సమయంలో ఇక తన నాలుగు నెలల కొడుకుని ఇంట్లోనే పడుకోబెట్టింది. గమనించిన శాలినీ తల్లి ఇంట్లోకి వెళ్లి నాలుగు నెలల పసిగుడ్డు నోట్లో యాసిడ్ పోసి ఇక అక్కడి నుంచి బయటకు వచ్చింది. అయితే ఇక ఇంటికి చేరుకున్న రాఖీ తల్లి తన నాలుగు నెలల కొడుకును గమనించింది. అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలిసి..వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. చిన్నారి చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. వినోద్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: