పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను ఎంతో అల్లారుముద్దుగా పెంచింది ఆ తల్లి. ఉన్నత చదువులు చదివించి ప్రయోజకురాలిని చేయాలని భావించింది. సదరు బాలిక కూడా ఎంతో బాగా చదువుకుంటూ వచ్చింది. బాగా చదువుకొని జీవితంలో పైకి ఎదగాలని భావించింది. అయితే కూతురు ఎంతో చురుగ్గా చదువుతుంటే ఒక కూతురు బంగారు భవిష్యత్తును కలలు కనాల్సిన ఆ తల్లి ప్రియుడితో సుఖానికి కలలు కంది ఆ తల్లి. దీంతో బంగారు భవిష్యత్తు ఉన్న కూతురి ప్రాణాలు పోవడానికి  కారణం అయ్యింది.


 సరదాగా ఉంటూ చదువులో ఎంతో ఫాస్ట్ గా ఉండే యువతి చివరికి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే తల్లి వివాహేతర సంబంధమే ఈ మృతికి కారణం అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి   ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా లింగసముద్రం లో వెలుగులోకి వచ్చింది. మాధవి అనే మహిళ ఏఎన్ఎం గా పనిచేస్తోంది. భర్తతో విడిపోయి కుమార్తె ప్రశాంతి తో ఒంటరిగా ఉంటుంది ఆమె.. ఇక కుమార్తె చదువుల్లో ఎంతో చురుగ్గా ఉండేది. ప్రస్తుతం కాలేజీలో చదువుతోంది. మూడు రోజుల కిందట అనుమానాస్పద రీతిలో మృతి చెందింది.


  కూతురు మృతదేహాన్ని ఒకరోజు పాటు ఇంట్లోనే ఉంచినా తల్లి ఆ తర్వాత రాత్రి సమయంలో రహస్యంగా తీసుకొని అడవిలో దహనం చేసింది. దీనికోసం ఇక ఆమె ఇంటి పక్కన ఉండే ఒక యువకుడు తో పాటు అతని స్నేహితుల సహాయం కూడా తీసుకుంది మాధవి. అయితే ఈ ఘటనతో స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. దీంతో వివాహేతర సంబంధమే ప్రశాంతి హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మాధవి సహా కింది పోర్షన్ లో ఉంటున్న యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో మరింత అనుమానాలు ఎక్కువయ్యాయి. దీంతో ఇక ఈ కేసుపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: