సాధారణం గా మనిషి అన్న తర్వాత ఏదో ఒక రకమైన కోరిక ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే తమ కోరికలను నెరవేర్చు కోవడానికి కొన్నిసార్లు వింత పనులు చేస్తూ ఉంటారు చాలా మంది. ఇలా వింత కోరికలతో కొంత మంది చేసే పనులు అందరిని ముక్కున వేలేసుకునేలా చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన జరిగింది. సాధారణం గా చావు అంటే ప్రతి ఒక్కరు భయపడి పోతుంటారు. ఇక చని పోయిన తర్వాత ఏం జరుగుతుంది  అంటే ఆత్మ పరమాత్మలో కలిసి పోతుంది అని అంటూ ఉంటారు.


 చని పోయిన తర్వాత కొన్నాళ్ల పాటు ఆత్మ బ్రతికే ఉంటుందని అందరూ ఏం చేస్తున్నారు అన్న విషయాన్ని చూస్తూ ఉంటుందని మరికొంత మంది మూఢనమ్మకాలను కూడా నమ్ముతూ ఉంటారు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది మాత్రం చనిపోయిన వాళ్లకే తెలుసు. కానీ వాళ్ళు చెప్పలేరూ కదా. అందుకే ఈ విషయంలో ఎన్నో ఊహాగానాలు అప్పుడప్పుడు తెరమీదికి వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక యువకుడు మాత్రం కాస్త సాహసం చేశాడు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకున్నాడు.


 చివరికి ఈ వింత కోరిక తో తన ప్రాణాలను తానే తీసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడు లోని తిరునల్వేలి జిల్లాలో వెలుగు లోకి వచ్చింది. సల్మాన్ అనే 19 ఏళ్ల యువకుడు చని పోయిన తర్వాత ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది అని తెలుసు కోవడానికి ఆత్మహత్య చేసుకున్నాడు. లా సెకండియర్ చదువుతున్న సల్మాన్ హాస్టల్ గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే తాను సూసైడ్ చేసుకుంటున్నాను అంటూ ఒక లెటర్ కూడా రాయడం గమనార్హం. ఈ ఘటన కాస్త ప్రస్తుతం సంచలనం గానే మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: