మహిళలు అడుగడుగునా భయపడుతూనే బ్రతుకుతున్నారు. కారణం నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలే. మంచి వాళ్ళ ముసుగులో సమయం సందర్భం చూసి మాటువేసి అఘాయిత్యాలకు పాల్పడుతున్న మానవ మృగాలు కొంతమంది అయితే.. ఇక ఆడపిల్లలు ఒంటరిగా కనిపిస్తే చాలు బలవంతంగా అత్యాచారాలు చేస్తున్న వారు మరికొంతమంది. ఇక ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా ఎక్కడో ఓ చోట ప్రతిరోజు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నెలలు నిండని పసికందుల నుంచి పండు ముసలి వరకూ ఎవరిని వదలడం లేదు కామాంధులు.


 ఇక ఇటీవల చత్తీస్ ఘడ్ లో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. బాలిక కంగారుగా ఏడుస్తూ ఇంటికి వచ్చింది. దీంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏం జరిగింది అంటూ అడిగారు. ఈ క్రమంలోనే ఊరిబయట ఉన్న పొలం లో జరిగిన ఘటన గురించి ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.  ఏకంగా ఓ యువకుడు సదరు బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. జష్పూర్ జిల్లా పర్సా బహార్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.


 అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఇటీవలే బంధువుల ఇంటికి వెళ్తున్న అంటూ చెప్పి ఒంటరిగా బయలు దేరింది. మార్గమధ్యంలో అదే ప్రాంతానికి చెందిన మహేష్ యాదవ్ అనే యువకుడు అడ్డుపడి నువ్వంటే ఇష్టం.. నేను ప్రేమిస్తున్నాను అంటూ ప్రపోజ్ చేశాడు. బాలిక ఒప్పుకోకపోవడంతో  పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక ప్రతిఘటించి ఇక యువకుడిని భారీ నుంచి తప్పించుకుని ఇంటికి వచ్చింది.. కంగారుగా ఏడుస్తూ తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు  చేసారు. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు  పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: