డాక్టర్లు అంటే నేటి కరోనా సమయంలో కనిపించే దైవాలుగా మారిపోయారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే తమ ప్రాణాలను పణంగా పెట్టి మరి ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ఎంతో మంది డాక్టర్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే వైద్య వృత్తి పై ప్రతి ఒక్కరికి మరింత గౌరవం పెరిగిపోయింది అనే చెప్పాలి. ఆ దేవుడు జన్మను ప్రసాదిస్తే డాక్టర్లు  పోయే ప్రాణాన్ని కూడా నిలబెట్టి పునర్జన్మ ప్రసాదించడం లాంటివి చేస్తూ ఉంటారు. అందుకే డాక్టర్ వృత్తి ఎంతో గొప్పది అని అంటూ ఉంటారు. కానీ ఇటీవలి కాలంలో కొంతమంది డాక్టర్లు వైద్య వృత్తికి కళంకం తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు.


 ఎంతో మంది ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన డాక్టర్లు నిర్లక్ష్యంగా వైద్య చికిత్స చేస్తూ చివరికి ఇక ప్రజల ప్రాణాలను హరించేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక మరికొంతమంది నీచాతి నీచంగా ప్రవర్తిస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నారు.  ఏకంగా తమ దగ్గరికి వైద్యం కోసం వచ్చిన మహిళను లొంగదీసుకుని అత్యాచారాలకు పాల్పడడం కూడా చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఘటనలు అక్కడక్కడా వెలుగులోకి వస్తు వైద్య వృత్తికే కళంకం తెస్తున్నాయి. ఇక్కడ రాజస్థాన్లోని భరత్పూర్ ప్రాంతంలో ఇలాంటి దారుణం జరిగింది. వైద్యం కోసం తన వద్దకు వచ్చిన ఒక మహిళపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు ఇక్కడ ఓ  వైద్యుడు.


 ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి. ఓ మహిళ అనారోగ్యం కారణంగా స్థానికంగా ఉండే మజ్రద్దీన్ అనే 38 ఏళ్ల డాక్టర్ క్లినిక్ కి వెళ్ళింది. అయితే అక్కడికి వచ్చిన మహిళను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ డాక్టర్. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని హెచ్చరించాడు. అయితే జరిగిన దారుణాన్ని బాధితురాలు తన భర్తకు చెప్పింది. ఈ క్రమంలోనే అతని ఫిర్యాదుతో  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలే నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసు విచారణలో అతను ఒక నకిలీ డాక్టర్ అన్న విషయం కూడా తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: