ఇటీవల కాలంలో ప్రతి మనిషి కూడా స్వార్థం కోసం ఆలోచిస్తూ ఇక బంధాలకు బంధుత్వాలకు అస్సలు విలువ ఇవ్వడం లేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే క్షణకాల సుఖం కోసం అక్రమ సంబంధాలకు తెర లేపుతూ  దారుణాలకు పాల్పడుతూ ఉండడం కూడా నేటి రోజుల్లో చూస్తూనే ఉన్నాం. ఏకంగా వావి వరసలో మరిచిపోయి నీచమైన పనులకు పాల్పడుతున్నారు అని చెప్పాలి. ఇలా నేటి రోజులు అక్రమ సంబంధాల కారణంగా ఆత్మహత్యలు హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇక ఇండోనేషియాలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.



 ఒకే ప్రాంతంలో ఉండే యువతి యువకులు ఇద్దరు కూడా ఐదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే అతి కష్టం మీద తల్లిదండ్రులను ఒప్పించి ఇక బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లయిన తర్వాత మూడు రోజులకి నూతన వధూవరులకి శోభనం ఏర్పాటు చేశారు పెద్దలు. ఈ క్రమంలోనే అన్ని ఏర్పాట్లు పూర్తి అయిన తర్వాత పెళ్లి కొడుకు తో పాటు పెళ్లికూతురు తల్లి కూడా కనిపించలేదు. ఇద్దరి కోసం కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంత వెతికిన ప్రయోజనం లేకుండా పోయింది.


 దీంతో కోపంతో ఊగిపోయిన పెళ్లికూతురు ఇక సైలెంట్ గా వెళ్లి తన బెడ్ రూమ్లో పడుకోవాలి అని భావించింది. ఈ క్రమంలోనే తన గది డోర్ తీసింది. దీంతో గదిలో కనిపించిన సీన్ చూసి ఒక్కసారిగా షాక్ అయింది. ఏకంగా తాను పెళ్లి చేసుకున్న భర్త తన తల్లి రొమాన్స్ లో మునిగి తేలుతున్నారు. ఇక ఇలా లోపల తల్లిని, భర్తను చూసి ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక ఆ తర్వాత ఈ విషయం అక్కడున్న బంధుమిత్రులందరికీ కూడా తెలిసిపోయింది. దీంతో ఇలాంటి మొగుడు నాకొద్దు అంటూ వెంటనే విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది నవ వధువు.

మరింత సమాచారం తెలుసుకోండి: