డబ్బు డబ్బు నువ్వు ఏం చేస్తావు అని అడిగితే.. భార్యాభర్తల మధ్య చిచ్చు పెడతాను. అన్నదమ్ముల మధ్య రక్తసంబంధం కనుమరుగయ్యేలా చేస్తాను.  తండ్రి కొడుకులు ఒకరిని ఒకరి చంపుకునేలా చేస్తాను అని అని చెబుతుందట. ఇక నేటి రోజుల్లో వెలుగులోకి వచ్చే ఘటనలు ఇందుకు నిదర్శనంగా కొనసాగుతూ ఉన్నాయి. బంధాలకు బంధుత్వాలకు విలువ ఇవ్వని మనిషి నేటి రోజుల్లో డబ్బు మాయలో పడిపోయి దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు. ఏకంగా సొంత వారి ప్రాణాలనే దారుణంగా గాల్లో కలిపేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి.


 ఆరడుగుల మనిషిని ఆరంగులాల నోటు నడిపిస్తుంది ఆడిస్తుంది పాడిస్తుంది. ఇక డబ్బు ఏం చెబితే మనిషి ఇప్పుడు అదే చేసేస్తూ ఉన్నాడు.  ఏకంగా కనీ పెంచిన తల్లిదండ్రులను కూడా ఆస్తులు కోసం దారుణంగా హత్యలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి దారుణమే జరిగింది. ఏకంగా సొంత అన్ననే తమ్ముడు దారుణంగా చంపేశాడు. ఇంటి అద్దె విషయంలో ఇద్దరి మధ్య మొదలైన వాగ్వాదం చివరికి ఒకరు ప్రాణం పోవడానికి కారణమైంది అని చెప్పాలి. తన చేతిలో ఉన్న చపాతీ కర్రతో తమ్ముడిని అన్న కొట్టాడు. దీంతో ఆవేశానికి గురైన తమ్ముడు అన్నను కత్తితో విచక్షణ రహితంగా పొడిచి చంపేశాడు.



 ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గౌతమ్ నగర్ కమ్యూనిటీ హాల్లో అస్సాం కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఉంటున్నారు. అయితే ఇటీవల ఇంటి అద్దె చెల్లించే విషయంలో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. అయితే అన్న అంజన్  తమ్ముడు రంజన్ పైకి ఏకంగా చపాతీ కర్రను విసిరాడు. దీంతో తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు రంజన్. అక్కడే ఉన్న కూరగాయల కత్తితో అన్న కడుపులో పొడిచాడు. దీంతో రక్తపు మడుగులో అన్న అంజన్ అక్కడికక్కడే చనిపోయాడు. ఘటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: