కావాల్సిన ప‌దార్థాలు:
కొరమీను ముక్కలు- ఎనిమిది
పసుపు- చిటికెడు
కారం- రెండు స్పూన్లు

 

నూనె- త‌గినంత‌
ఉల్లిపాయలు - ఒక క‌ప్పు
పచ్చిమిర్చి- నాలుగు

 

అల్లంవెల్లుల్లి పేస్టు- ఒక టీ స్పూన్‌ 
ఎండుకొబ్బరి పేస్టు- అరకప్పు
గరం మసాల పొడి- ఒక టీ స్పూన్‌

 

ధనియాల పొడి- ఒక‌టిన్న‌ర‌ టేబుల్‌
కొత్తిమీర తరుగు- త‌గినంత‌
ఉప్పు- రుచికి సరిపడా

 

త‌యారీ విధానం: ముందుగా ఒక బౌల్‌లో చేపలతో పాటు ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా పొడి, ఉల్లి తరుగు, చీలిన పచ్చిమిర్చి వేసి అన్నీ బాగా కలిపి గంట సేపు పక్కనుంచాలి. ఇప్పుడు వెడల్పాటి పాన్‌లో నూనె వేసి ఒక్కో కొరమీను ముక్కా సర్దుతూ, ముక్క విరగకుండా రెండువైపులా వేగించాలి. 

 

ఇప్పుడు కొబ్బరిపేస్టు, నీరు పోసి మూతపెట్టి కదపకుండా మగ్గించాలి. నీరంతా ఇగిరిపోయి కూర దగ్గరవగానే కొత్తిమీర చల్లి స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే ఎంతో రుచిక‌ర‌మైన కొర‌మీను వేపుడు రెడీ..!!
 

మరింత సమాచారం తెలుసుకోండి: