ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ కుకింగ్ ఆర్టికల్ చదవండి.... పనీర్ పాయసం ఆరోగ్యానికి చాలా మంచిది. పనీర్ పాయసం తాగడం వలన మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయి. ఈ పండగ సీజన్లో త్వరగా అయిపోయే, సింపుల్ తీపి వంటకంగా పనీర్ పాయసాన్ని మీరు ప్రయత్నించవచ్చు. ఈ పనీర్ పాయసం కేవలం తీపిని ఇష్టపడేవారికే స్వర్గంలాంటిదే కాదు, చాలా త్వరగా అయిపోయే వంటకం కూడా. మరిగి గట్టిపడిన పాలలోకి పనీర్ ను చిదిమి వేస్తాం కాబట్టి, ఈ వంటకం చాలా సులభంగా అయిపోతుంది. ఈ తయారీ విధానంలో పాలను, పంచదార ఇంకా పనీర్ ను వాడతారు. ఈ రుచికరమైన వంటకాన్ని ఇంట్లో ప్రయత్నించి మీ దగ్గరివారిని సంతోషపర్చండి!


రుచికరమైన పనీర్ పాయసం తయారు చెయ్యడానికి  కావాల్సిన పదార్ధాలు...

ప్రధాన పదార్థం....

1 కప్ పనీర్....

1 లీటర్ పాలు.....

ప్రధాన వంటకానికి....

1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి.....

1/4 టీ స్పూన్ పొడిగా చేసిన యాలకులు....

1/4 కప్ చక్కర పొడి....

అలంకారానికి...

10 కుంకుమ పువ్వు....

అవసరాన్ని బట్టి ముక్కలుగాా కోసిన బాదం....

అవసరాన్ని బట్టి తరిగిన పిస్తా పప్పు....

ఇక ఈ రుచికరమైన నోరూరించే పనీర్ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి...

ఒక పెనంలో పాలను మరిగేదాకా కలుపుతుండండి. అందులో బియ్యంపిండి వేయండి ఇంకా ఆ మిశ్రమాన్ని 8-10 నిమిషాల వరకూ ఉడకనివ్వండి లేదా పాలు గట్టిపడేదాకా ఉడకనివ్వండి.


పాల మిశ్రమానికి డ్రైఫ్రూట్లు,ఏలకులు, కుంకుమపువ్వు రేకులు వేసి కలపండి. కొన్ని నిమిషాల తర్వాత, పంచదార వేసి మిశ్రమం గట్టిపడేవరకూ ఉడకనివ్వండి.

తక్కువ మంటలో, చిదిమిన పన్నీర్ ను వేసి 2-3 నిమిషాల పాటు బాగా కలపండి.

పాయసాన్ని దించి కప్పులలో వేడిగానో లేదా చల్లగానో వడ్డించండి. దాన్ని వడ్డించేముందు కుంకుమపువ్వు మరియు బాదంపప్పులతో అలంకరించి తర్వాత వడ్డించండి.

ఇలాంటి మరెన్నో కుకింగ్ ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...  ఇంకా చాలా వంటకాలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి....





మరింత సమాచారం తెలుసుకోండి: