ఇప్పటివరకు మనం రౌడీలు, దొంగలు కిడ్నాప్ చేయడం మాత్రమే చూసాం. ఎక్కడలేని విధంగా సీనిపక్కిలో హిజ్రాలు యువకులను తీసుకెళ్లి వారిలో కలుపుకుంటున్నారని, ఆ పని నేర్పుతారని తెలుస్తోంది. అలాంటి సంఘటనే ఈమధ్య సిరిసిల్లలో చోటు చేసుకుంది. అక్కడ ఒక యువకుడిని తీసుకెళ్లి దారుణంగా వారిలో కలుపుకున్నారు.
గత కొద్ది రోజులుగా మహేష్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు.
అతని కోసం బంధువులు, స్నేహితులు ఇంట్లో వెతికారు కానీ ఫలితం లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మహేష్ వేములవాడలో ఉంటున్నట్టు తల్లి దండ్రులకు సమాచారం అందింది. అయితే ఆ యువకుడు రెండు నెలలుగా ఎందుకు వేములవాడలో ఉన్నాడని, అతన్ని ఎవరూ తీసుకెళ్లారని ఈ విధంగా ఎందుకు చేస్తున్నారని పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేశారు. ఇందులో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. మహేష్ వేములవాడ లో ఉన్నాడని తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడికి వెళ్లారు. అక్కడ మహేష్ ఉన్న పరిస్థితిని చూసి షాక్ అయ్యారు. మహేష్ పూర్తి హిజ్రా వేషంలో ఉన్నాడు.
తల్లిదండ్రులు మహేష్ ను ఇంటికి తీసుకువెళ్లాలని ప్రయత్నించగా అక్కడ ఉన్నటువంటి హిజ్రాల అంతా కలిసి అడ్డుకున్నారు. దీంతో హిజ్రాలకు వారి తల్లిదండ్రుల మధ్య వాగ్వాదం నెలకొంది. స్థానికులు అంత కలిసి హిజ్రాలను చితకబాదారు. తర్వాత మహేష్ ను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. అయితే గత కొద్ది రోజులుగా వేములవాడలో హిజ్రాలు హల్ చల్ చేస్తున్నారని సమాచారం. వీరి వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు పోలీసులను కోరుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీరు ఇంకెంత మంది యువకులను ఈ ఊబిలోకి లాగారన్న కోణంలో సమాచారాన్ని లాగుతున్నారు. వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు వేములవాడలో ప్రత్యేక చర్యలు తీసు కుంటున్నారు. ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు కోరుతున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: