ఇటీవల కాలంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇక ఇటీవలే వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే సభ్యసమాజంలో ఆడపిల్లగా పుట్టడమే పాపమా అని ప్రతి ఒక ఆడపిల్ల బాధ పడే పరిస్థితి నెలకొంటుంది. రోజురోజుకు సమాజంలో బ్రతుకుతున్న మనుషులు మానవ మృగాలు గా మారిపోతున్నారు. ఆడపిల్ల కనిపిస్తేచాలు దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు.



 ఆడపిల్లలకు రక్షణ కల్పించేందుకు అటు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా చట్టాలలోని లొసుగుల ను ఉపయోగించుకుంటూ చట్టాలను తమ చుట్టాలుగా మార్చుకుంటున్నారు ఎంతోమంది. ఈ క్రమంలోనే రోజురోజుకు ఆడపిల్లలపై హత్యాచారం ఘటనలు పెరిగిపోతున్నాయి.. తప్ప ఎక్కడా తగిన దాఖలాలు కనిపించడం లేదు.. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి దారుణం వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. ఏకంగా 13 ఏళ్ల తమ్ముడిని బంధించి మరీ అత్యాచారానికి పాల్పడ్డ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది.



 ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే ముజఫర్ నగర్ లో  ఒక కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు  శుభకార్యం నిమిత్తం ఇక పక్క గ్రామానికి వెళ్లారు. ఈ క్రమంలోనే ఇక ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో తలుపులు మూసుకుని 15 ఏళ్ల బాలిక 13 ఏళ్ల తమ్ముడు కూడా నిద్రపోయారు. ఇక్కడ ఉన్న ఇంట్లో ఎవరూ లేని విషయం గ్రహించారు కామాంధులు. ఇక తలుపు కొట్టారు.  తలుపు తీయడానికి వచ్చిన బాలిక నుదుటి మీద గన్ పెట్టి  బెదిరించి నలుగురు కామాంధులు లోపలికి వెళ్లారు. ఆ తర్వాత 13 ఏళ్ల తమ్ముడు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా తుపాకీతో బెదిరించి ఇక తమ్ముడు ముందే అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు ఇదంతా వీడియో చిత్రీకరించారు. ఎవరికైనా చెప్తే చంపేస్తాము అంటూ బెదిరించారు. అయితే ఇక వాళ్లు వెళ్లిపోయిన తర్వాత బాలుడు తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ముగ్గురు నిందితులను పట్టుకున్నారు పోలీసులు. మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: