ఇటీవలి కాలంలో మనుషులు బంధాలు బంధుత్వాలు అనే విషయానికి అసలు విలువ ఇవ్వడం లేదు. రోజురోజుకు మానవత్వాన్ని మరిచి పోతున్న మనుషులు ఉన్మాదుల కంటే  దారుణం గా వ్యవహరిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఒక మనిషిని హత్య చేస్తే శిక్షలు పడతాయని జైలులో చిప్పకూడు తినాల్సి వస్తుంది అన్న విషయాన్ని కూడా ఎవరూ ఆలోచించడం లేదు. క్షణికావేశంలో   నిర్ణయాలు తీసుకుంటూ మనిషి ప్రాణాలకు కనీసం విలువ ఇవ్వడం లేదు. ఉన్మాదులు గా మారిపోయి దారుణంగా ప్రాణాలు తీస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.



 ఇలా రోజురోజుకు మనుషులు ఉన్మాదులు గా మారిపోతున్న తీరు సభ్యసమాజాన్ని ఉలిక్కి పడేలా చేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు  రోజు రోజుకి ఇలాంటి తరహా ఘటనలు పెరిగిపోతున్నాయి తప్ప తగ్గడం లేదు. ముఖ్యంగా స్కూల్ కెళ్లే వయసులోనే ఎంతో మంది చిన్నారులు ఉన్మాదులు గా మారిపోతున్నారు. ఏకంగా సొంత వారిని కూడా హత్య చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. ఇటీవలే కర్ణాటకలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం సంచలనంగా మారిపోయింది. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న నలుగురు ఒక్కసారిగా మృతి చెందడం స్థానికులకు ఎన్నో అనుమానాలను కలిగించింది.



 ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఈ నలుగురు మృతి కేసును ఛేదించారు పోలీసులు. అదే ఫ్యామిలీకి చెందిన 17 ఏళ్ల బాలిక ఇక వారందరికీ విషం పెట్టి చంపినట్లుగా విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఈ ఏడాది జూలైలో ఈ ఘటన జరిగింది. అయితే రాగిసంకటి తిన్న కుటుంబీకులలో బాలిక తల్లిదండ్రులతో పాటు నాయనమ్మ చెల్లి కూడా మరణించారు. అయితే ఇంట్లో తన కంటే ఇద్దరు చిన్న వాళ్ళు ఉన్నప్పటికీ పనులన్నీ తనకే చెబుతారని తనపై ప్రేమ చూపించడం లేదు అన్న కారణంతోనే ఇక రాగి సంగటి లో విషం పెట్టి చంపాను అంటూ ఆ బాలిక పోలీసు విచారణలో ఒప్పుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: