భార్య భర్తల బంధం అంటే ఆత్మహత్యలు హత్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతుంది నేటి రోజుల్లో. అన్యోన్యతకు చిరునామాగా ఉండాల్సిన భార్యాభర్తల మాత్రం ఎన్నో నేరాలకు కారణంగా మారిపోతుంది. ఇటీవల కాలంలో అయితే భార్యాభర్తల మధ్య ఎక్కడ ప్రేమానురాగాలు కనిపించడం లేదు. మూడుముళ్ల బంధంతో ఒక్కటైన  భార్య భర్తలు ఏకంగా బద్ద శత్రువులు అనే విధంగా వ్యవహరిస్తున్నారు. ఏకంగా ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకోవడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. ఇలా కట్టుకున్న వారిని కడ తేరుస్తూ ఎంతోమంది జైల్లో ఊచలు లెక్కపెడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.


ఇలాంటి ఘటనలు నేటి సభ్య సమాజం తీరుకు అద్దం పడుతున్నాయి.  ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. పడక సుఖం తీర్చలేదు అన్న కారణంతో కోపంతో ఊగిపోయాడు భర్త. దీంతో మనిషి కాస్త మృగంలా మారిపోయాడు. మూడు ముళ్ళు వేసి కడవరకు తోడు ఉంటాను అంటూ ప్రమాణం చేసిన వాడే దారుణంగా భార్యను హతమార్చాలి అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ప్రాణాలు తీసేసాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది. 2019లో కామారెడ్డి లో చోటుచేసుకున్న ఈ హత్య కేసులో ఇటీవలే కోర్టు తీర్పును వెలువరించింది.



 కామారెడ్డి జిల్లా నాగ రెడ్డి పేట మండలం కన్నా రెడ్డికి చెందిన మోహన్.. లక్ష్మి అనే మహిళ ను కొన్నేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. మద్యానికి బానిస గా మారిపోయిన మోహన్.. పిల్లల ముందే భార్యను కోర్కెలు తీర్చాలంటూ ఎప్పుడూ వేధించేవాడు. భార్య మాత్రం వారిస్తూ వచ్చేది. దీంతో భార్య పడక సుఖం తీర్చడం లేదు అంటూ కక్ష పెంచుకున్నాడు భర్త. 2019 డిసెంబర్ 18వ తేదీన భార్యపై బలవంతంగా కామ వాంఛ తీర్చుకోవాలని భావించాడు. కానీ భార్య కసురుకోవడం తో ఇక కోపంతో ఊగిపోయిన భర్త ఏకంగా సుత్తితో దారుణంగా భార్య తలపై కొట్టి చంపేశాడు. ఇదంతా చూసిన కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలోనే పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించి ఐదేళ్ల పాటు అతనికి జైలు శిక్ష విధించింది కోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: