మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడా తగ్గడం లేదు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామందుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కామందుల కోరల్లో చిక్కుకొని ఎంతోమంది అభం శుభం తెలియని ఆడపిల్లలు బలి అవుతున్నారు అని చెప్పాలి. ఇలా దేశంలో ఎక్కడో ఓ చోట రోజురోజుకీ అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇలా వెలుగులోకి వస్తున్న అత్యాచార ఘటనలు ఆడపిల్లల రక్షణ రోజురోజుకు ప్రశ్నార్థకంగానే మార్చేస్తున్నాయి అని చెప్పాలి.


 నెలలు నిండని పసికందులు నుంచి పండు ముసలి వరకు కామంతో ఊగిపోతున్న మానవ మృగాలు ఎవ్వరిని వదలడం లేదు. పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తూ  దారుణంగా అత్యాచారానికి పాల్పడుతూ ఉన్నారు . ఇక ఇటీవలే తెలంగాణ లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా 80 ఏళ్ల వయస్సు ఉన్న వృద్ధుడు కామం తో ఊగిపోయాడు. ఈ క్రమంలోనే మనవరాలి వయసున్న చిన్నారిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు ఆ వృద్ధుడు. ఈ ఘటన కాస్త స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.



 పాతబస్తీకి చెందిన బషీర్ అనే 80 ఏళ్ల వృద్ధుడు వృద్ధ వయసులో కూడా ఒక వృద్ధురాలి తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలో ని తరచూ ఆ మహిళను కలుస్తున్న క్రమంలోనే ఇక అదే ఇంట్లో ఉంటున్న ఆ వృద్ధురాలి మనవరాలిపై కామాంధుడి కన్నుపడింది. ఈ క్రమంలోనే ఓ రోజు సమయం చూసి 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తాను అంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు.  అయితే ఇక కొన్ని రోజులనుంచి బాలిక ప్రవర్తనలో తేడా గమనించిన అమ్మమ్మ బషీర్ ను ప్రశ్నించగా తనకు ఏమీ తెలియదు అంటూ మాట దాటవేశాడు సదరు వృద్ధుడు. దీంతో అనుమానం వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించగా.. అత్యాచారం చేశాడు అనే విషయం బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: